ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
భారతదేశమంతటా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించిన స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.
గ్రామంలోని బీసీ స్కూల్ ఆవరణలో విద్యార్థులకు స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం గురించి వివరించారు.
విద్యార్థులకు స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు పట్టించి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం 100 రోజుల భాగంగా రెండవ రోజుగా పారిశుద్ధి గురించి అవగాహన కల్పించారు.
పారిశుద్ధి కార్మికులకు ప్రథమ చికిత్స శిక్షణ అందించారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించాలని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మైమున్న బేగం సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.