Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది

-

Chat on WhatsApp

ఏపీలో భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమ‌ల‌కు భ‌క్తుల ర‌ద్దీ భారీగా త‌గ్గిపోయింది. గ‌త రెండుమూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థకు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో భ‌క్తుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దీంతో మునుప‌టి మాదిరి స్వామివారి ద‌ర్శ‌నానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌డం లేదు. కేవ‌లం 6 గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తవుతోంది. 

ఉచిత సర్వదర్శనం కోసం భ‌క్తులు ఐదు కంపార్టుమెంట్లలో మాత్ర‌మే వేచి ఉన్నారు. అటు టైమ్‌ స్లాట్‌ (ఎస్‌ఎస్‌డీ) ద‌ర్శ‌నం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే  ప్రత్యేక ప్రవేశ దర్శనం కేవ‌లం రెండు గంట‌ల‌ సమయం మాత్ర‌మే పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.55 కోట్లు వ‌చ్చింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CSK batter Aman Khan celebrates his 34-ball century in the Pondicherry Premier League

Pondicherry Premier League | 35 బంతుల్లో కాదు.. 34 బంతుల్లోనే సెంచరీ అది...

టీ20 క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అమన్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌(Pondicherry Premier League)లో అద్భుతమైన బ్యాటింగ్‌తో కేవలం 34 బంతుల్లోనే సెంచరీ...
- Advertisement -
Chat on WhatsApp