Assam Voilence: అస్సాం రాష్ట్రంలోని వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు భారతీయ న్యాయ సంహితలోని జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని జిల్లా మెజిస్ట్రేట్ నిరోలా పాంగ్చోపీ వెల్లడించారు. డిసెంబర్ 22 నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు.
నిరసనలు – పోలీసు కాల్పులు
సోమవారం కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న కొంతమంది పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి.
ALSO READ:H-1B ఉద్యోగులకు గూగుల్ కీలక నిర్ణయం
ఖేరోని ప్రాంతంలో విధ్వంసం
గత 12 రోజులుగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను చెదరగొట్టే ప్రయత్నంలో ఖేరోని ప్రాంతంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్ (పీజీఆర్), విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్ (వీజీఆర్) భూముల్లో జరుగుతున్న అక్రమ ఆక్రమణలను తక్షణమే నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
నిప్పు పెట్టిన ఘటన
ఈ ఉద్రిక్తతల మధ్య కర్బి ఆంగ్లాంగ్ ఆటానమస్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తులీరామ్ రోహంగాంగ్ నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో డొంకమో ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సమయానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మతపరమైన, వర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
