G20 Summit South Africa: ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సు (G20 Summit)లో పాల్గొననున్నారు.ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జోహన్నెస్బర్గ్కు బయలుదే అక్కడికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా (IBSA) నాయకుల సమావేశంలో పాల్గొని, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.
ALSO READ:రైతన్నా మీ కోసం | ఈ నెల 24 నుంచి ప్రారంభం
వరుసగా నాలుగోసారి గ్లోబల్ సౌత్ దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం ఇది. జీ20 సదస్సులో మూడు ముఖ్య సెషన్లలో ప్రధాని మోదీ సందేశాలు ఇవ్వనున్నారు. ఆర్థికాభివృద్ధి, గ్లోబల్ పాలసీలు, దక్షిణ గోళం దేశాల ప్రయోజనాలపై ఆయన కీలక విషయాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
