Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadSaudi Bus Accident: సౌదీలో 42 మంది భారత యాత్రికులు మృతి 

Saudi Bus Accident: సౌదీలో 42 మంది భారత యాత్రికులు మృతి 

-

Chat on WhatsApp

ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు.ఏ మధ్యకాలంలోనే చాలా ప్రమాదాలు జరిగాయి .తాజాగా మళ్ళీ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం(Saudi Bus Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 42 మంది యాత్రికులు మృతిచెందినట్లు సమాచారం.

మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ టాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైంది. బస్సులో ఉన్న భారతీయులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.

ALSO READ:Mithali Thakur:బీహార్ యువ ఎమ్మెల్యే మిథాలీ ఠాకూర్


మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన వారేనని ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉండటం విషాదాన్ని మరింత పెంచింది.

ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలను ఆర్పి శరీరాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రమాదంపై భారత రాయబారి కార్యాలయం సౌదీ అధికారులతో సమన్వయం చేస్తోంది. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp