Friday, July 31, 2026
Chat on WhatsApp
HomeTelanganaటెక్ మహీంద్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట!

టెక్ మహీంద్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట!

-

Chat on WhatsApp

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అనంతరం, ఆ కంపెనీని కొనుగోలు చేసిన టెక్ మహీంద్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2002-09 మధ్యకాలంలో సత్యం కంపెనీ చూపించిన వాస్తవ ఆదాయంపైనే ఆదాయపు పన్ను చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఊహాజనిత లెక్కలు ఆధారంగా పన్ను విధించరాదని కోర్టు స్పష్టం చేసింది.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) సత్యం 2002-09 ఆదాయాన్ని పన్ను మదింపు కోసం పరిగణనలోకి తీసుకోకూడదని పేర్కొనగా, టెక్ మహీంద్రా దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ పి. శ్యాంకోశి, జస్టిస్ ఎన్. తుకారాంజీల ధర్మాసనం ఈ కేసును విచారించింది. సత్యం కంపెనీ కుంభకోణం నేపథ్యంలో అసలు ఆదాయంపైనే పన్ను విధించాలన్న టెక్ మహీంద్రా వాదనను కోర్టు సమర్థించింది.

సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు కంపెనీ లెక్కల్లో అసత్య సమాచారాన్ని చూపించారని, అటువంటి ఊహాజనిత ఆదాయంపై పన్ను చెల్లించాలనడం అన్యాయం అని టెక్ మహీంద్రా వాదనలు వినిపించింది. ఈ వాదనలను కోర్టు సమర్థించడంతో, 2002-09 మధ్య సత్యం కంపెనీ చూపించిన అబద్ధపు లెక్కలను పరిగణనలోకి తీసుకోకూడదని తీర్పునిచ్చింది.

ఈ తీర్పుతో టెక్ మహీంద్రాకు భారీ ఊరట లభించగా, కంపెనీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. సత్యం కుంభకోణం నుంచి బయటపడి కంపెనీకి న్యాయపరమైన స్పష్టత రావడమే కాకుండా, భారీ పన్ను భారం తప్పిందని విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir Trust  | రామమందిర ట్రస్ట్‌లో కీలక మార్పులు.. ఐఐటీ మాజీ విద్యార్థికి...

Ayodhya Ram Mandir Trust:  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో కీలక అడుగు వేసింది. ట్రస్ట్ తొలి కార్యదర్శిగా ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి జగదీశ్ అఫాలేను నియమించింది. ఆలయ పరిపాలనతో పాటు ఆర్థిక...
- Advertisement -
Chat on WhatsApp