Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaగుడిసెలు స్థిరపరిచేందుకు నాయకత్వం పట్ల గుడిశవాసుల ఆందోళన

గుడిసెలు స్థిరపరిచేందుకు నాయకత్వం పట్ల గుడిశవాసుల ఆందోళన

-

Chat on WhatsApp

వరంగల్ జిల్లా జక్కులది గ్రామ శివారులో మూడు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న గుడిసవాసులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గతంలో నాయకత్వం వహించిన సాగర్ అనే వ్యక్తి పై పలు ఆరోపణలు రావడంతో, అతనిని తొలగించి కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, గుడిసవాసుల అభిప్రాయం ప్రకారం సాగర్ నాయకత్వంలోనే గుడిసెల వద్ద ఎర్రజెండా మళ్లీ ఎగరాలని వారు కోరుతున్నారు.

ప్రస్తుత నాయకులపై గుడిసవాసులు తీవ్ర ఆరోపణలు చేశారు. రోజుకో పార్టీ పేరు చెప్పి కాలయాపన చేస్తూ తమ సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని వారు ఆరోపించారు. గుడిసెలు స్థిరమైన నివాసాలుగా మారతాయని ఆశతో నిరుపేదలు ఇన్ని రోజులు వేచి ఉన్నారని, కానీ తమ ఆశలు ఫలించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర వహించాలని గుడిసవాసులు విజ్ఞప్తి చేశారు. తక్షణ చర్యలు తీసుకుని గుడిసెలు స్థానంలో పక్కా నివాసాలు కల్పించాలని వారు కోరుతున్నారు. తమ హక్కుల కోసం ఆందోళన చేయడం తప్ప మరో మార్గం లేదని వారు తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిరుపేద గుడిసవాసులకు శాశ్వత నివాసాల కల్పనపై చర్యలు తీసుకోవాలని గుడిసవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలు పరిష్కరించబడితేనే తాము సంతోషంగా జీవించగలమని వారు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp