Wednesday, April 1, 2026
Chat on WhatsApp
HomeOthers9 క్యారెట్ల బంగారంఫై కేంద్రం కీలక నిర్ణయం

9 క్యారెట్ల బంగారంఫై కేంద్రం కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

ప్రస్తుతం బంగారం ధరలు రూ. 70 వేలకు అటూఇటుగా కొనసాగుతున్నాయి. దీంతో అటువైపు చూడాలంటేనే మగువలు భయపడుతున్నారు. అంతేకాదు, బంగారం చోరీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో, నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. 

దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై 9 కేరెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్న ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసింది. 9 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారంపైనా దాని నాణ్యతలను ధ్రువీకరించే హాల్‌మార్క్ ఉంటుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deputy cm pawan kalyan announcing free electricity scheme for handloom and powerloom workers in andhra pradesh

Deputy Cm Pawankalyan | నేతన్నల కష్టాలకు ఉపశమనం…ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి

Deputy Cm Pawankalyan: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం, ఈ రోజు నుంచే చేనేత రంగానికి ఉచిత విద్యుత్...
- Advertisement -
Chat on WhatsApp