రేగిడి పర్యటనలో కోండ్రు మురళీమోహన్

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కోండ్రు మురళీమోహన్, పంటనష్టం నివేదికను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. రేగిడి పర్యటనలో కోండ్రు మురళీమోహన్

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు*

ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు*

అనంతరం లోతట్టు ప్రాంతమయిన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉద్రితితో నీటమునిగిన పంటను అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు*

మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు.నీట మునిగిన పంటనష్టంను అధికారులు నివేదికను త్వరితగతిన అందజేయాలన్నారు

పంటనష్ట పరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.*

ముంపునకు గురవుతున్న రేగిడి గ్రామంలో కరకట్టల నిర్మాణంపై సీఎం దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో రేగిడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *