తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విద్యారంగంపై తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. విద్యార్ధి జీవితంలో తల్లి పాత్ర అమూల్యమని,వారిని స్పూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి ముందుకు వెళ్లాలని లోకేష్ పిలుపునిచ్చారు. 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లు జమ చేస్తునట్టు ప్రకటించారు. ప్రత్యేకించి పల్లెల్లో చదువుతున్న బాలబాలికలు తమ తల్లుల కృషిని గుర్తుంచుకోవాలంటూ, వారి ఆశీర్వాదంతో చదువులో రాణించాలని సూచించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహించనున్నట్టు సమాచారం.చదువు ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు, మౌలిక సదుపాయాలపై లోకేష్ దృష్టి పెట్టనున్నారు.
“చదువే మార్గం – తల్లే శక్తి — లోకేష్ ఓ కొత్త సందేశం
