ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మూడు కేసులు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసిన ఘటనలపై పోలీసులు మొత్తం మూడు కేసులను నమోదు చేశారు.
మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్లపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ALSO READ:ఆంధ్రప్రదేశ్లో 50 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు – రూ.25,256 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం
అదే సమయంలో బోరబండ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్లపై మరో కేసు నమోదైంది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలను సేకరించిన అనంతరం ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో చట్టం, శాంతి భద్రతను కాపాడడం తమ ప్రధాన బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
