Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeNationalజామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్

జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్

-

Chat on WhatsApp

భారత్ టెక్నాలజీ రంగంలో వేగంగా పురోగమిస్తోంది. దీని భాగంగా దేశీయ దిగ్గజ కంపెనీలు తమ వంతుగా భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ 3 గిగావాట్ల సామర్థ్యంతో ఉండనుంది.

ఈ డేటా సెంటర్ నిర్మాణం కోసం రిలయన్స్ అధునాతన ఏఐ చిప్‌లను కొనుగోలు చేయనుంది. అధునాతన టెక్నాలజీతో నిర్మించబోయే ఈ సెంటర్ భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులను విస్తృతంగా పెంచే అవకాశం ఉంది. భారీ డేటా నిల్వకు, ఏఐ కంప్యూటింగ్‌కు ఈ సెంటర్ కేంద్రంగా మారనుంది.

2023 అక్టోబర్‌లో రిలయన్స్, ఎన్విడియా కలిసి ఏఐ మౌలిక వసతుల ఏర్పాటుపై చర్చలు జరిపాయి. భవిష్యత్‌లో భారత్‌ను ప్రపంచ ఏఐ కేంద్రంగా మార్చే లక్ష్యంతో రిలయన్స్ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత ఐటి రంగానికి కొత్త శకం ప్రారంభమవుతుందని అంచనా.

ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ఒక్కరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ డేటా సెంటర్ భారతదేశానికి భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, ఆర్థికంగా కూడా మూడో అతిపెద్ద డిజిటల్ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nitish Kumar moves to Rajya Sabha, triggering leadership change debate in Bihar

Nitish Kumar |రాజ్యసభకు నితీష్ కుమార్.. బీహార్‌లో కొత్త సీఎం ఎవరు?

Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు ఆయన రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం...
- Advertisement -
Chat on WhatsApp