Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaనేడు తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక బిల్లులపై చర్చ

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక బిల్లులపై చర్చ

-

Chat on WhatsApp

తెలంగాణ కేబినెట్ భేటీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. కొత్త రెవెన్యూ చట్టం (ఆర్ఓఆర్) బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై కేబినెట్‌లో చర్చించి, ఆమోదించి శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.

పంచాయతీరాజ్ చట్ట సవరణలో భాగంగా, ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించే మార్పులు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపైనా ఈ సమావేశంలో చర్చించి, అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు.

మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో కేసు నమోదు చేయడంపై గవర్నర్ అనుమతి ఇవ్వడంతో, ఆ అంశంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణను కేబినెట్‌ చర్చించనుంది. దీనిపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

అదేవిధంగా, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను కేబినెట్‌ చర్చించనుంది. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కూడా అనుమతించనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp