అక్టోబర్ 14 వ తేదీ నుంచి జరుగు పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలి.మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ.. మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ…..
నాతవరం మండలం లో ఈనెల 14 తేది నుంచి 20 తేదీ వరకు పల్లే పండుగ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,స్పీకర్ అయ్యన్నపత్రుడు ఆదేశాల మేరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని,విధిగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ తెలిపారు మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26 పంచాయితీలకు కాను 56 పనులకు సుమారుగా 2.91 కోట్లు నిధులు విడుదల చేశారని తెలిపారు .
ఆ పనులు ఈనెల 14 నుంచి పనులు మొదలు పెడతారని. ఈ ఆరు రోజులు కార్యక్రమంలో ఏదో ఒక రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని తెలిపారు.
