రాష్ట్రంలో డిజిలాకర్ తరహా వ్యవస్థ రానుంది: డేటా ఆధారిత పాలనపై సీఎం చంద్రబాబు దృష్టి
కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే ప్రజలకు ఆధార్తో అనుసంధానమైన అన్ని పత్రాల వీక్షణ సౌకర్యం కల్పించే ప్రత్యేక వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుటుంబం యూనిట్గా ప్రతి పౌరుడి సమాచారం జియోట్యాగ్ చేయబడిందని, అన్ని శాఖలు ఆ డేటాను వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో ‘డేటా ఆధారిత పాలన’పై నిర్వహించిన సమావేశంలో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై ప్రభుత్వ సేవలు 100% ఆన్లైన్లో అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. “ప్రజలను…
