Municipal Elections | ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీఎం ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న సీఎం, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని…
