Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshగిరిజనుల ఆధార్ సమస్యపై అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే గళం

గిరిజనుల ఆధార్ సమస్యపై అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే గళం

-

Chat on WhatsApp

సంక్షేమ పథకాల కోసం అవసరమైన ఆధార్ కార్డుల సమస్యను గిరిజనుల అభ్యున్నతికి ప్రధాన అడ్డంకిగా గుర్తించి, అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గళమెత్తారు. ఆధార్ లేకపోవడంతో అర్హులైన గిరిజనులు పింఛన్లు, రేషన్, ఇతర పథకాల నుంచి దూరమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పైనాపురం పంచాయతీలోని చిన్న సంఘం కాలనీలో 88 మందికి ఆధార్ కార్డులు లేవు. అదేవిధంగా, 60 కుటుంబాలకు రేషన్ కార్డులు అందుబాటులో లేవు. 19 మంది అర్హత ఉన్నప్పటికీ పింఛన్ పొందడం లేదు. ఇదే విధంగా, మాచర్లవారిపాళెం, మల్లికార్జునపురం గ్రామాల్లో కలిపి 180 మందికి ఆధార్ కార్డులు లేవని ఎమ్మెల్యే వివరించారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించాలని ఆయన సూచించారు. అధికార యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్లి ఆధార్ కార్డు లేని వారి వివరాలను సేకరించి, వారికి ఆధార్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గిరిజనుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆధార్ సమస్యను పరిష్కరించేందుకు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎన్నో కుటుంబాలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp