Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి కోసం ధర్నా

రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి కోసం ధర్నా

-

Chat on WhatsApp

రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వంద పడకల ఆసుపత్రికి అనుగుణంగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులు ఆసుపత్రిలో అవినీతిని అరికట్టాలని, వైద్య సేవలు మెరుగుపరిచే అంశాలను పైకి తీసుకురావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామాలయం నుండి ప్రదర్శనగా ఆసుపత్రికి చేరుకున్న కార్మికులు, తమ ఆందోళనను విజ్ఞప్తి రూపంలో తెలియజేశారు.

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఈఎస్ఐ ఆసుపత్రి రాజమండ్రి లో అవినీతి కారణంగా సక్రమంగా పనిచేస్తుందనే విషయం దురదృష్టకరమని చెప్పారు. 35 మంది మాత్రమే ఉన్న సిబ్బందితో, వంద పడకల ఆసుపత్రి పనిచేయడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ పురందేశ్వరి గారు ఈ అంశంపై చర్య తీసుకుని కేంద్రంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. డిసెంబర్ రెండో వారం నాటికి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఆందోళనకు పూనుకుంటాయని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టికె విశ్వేశ్వర్ రెడ్డి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి గారు ఈ ఆసుపత్రిని సందర్శించి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. 100 పడకల ఆసుపత్రి మాత్రమే కాకుండా, అక్కడ మెరుగైన వైద్య సేవలు, ఆధునిక పరికరాలు, సురక్షితమైన వాతావరణం కూడా అందించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఈ ఆసుపత్రిలో కనీసం సీసీ కెమెరాలు లేదా సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడం, ఇతర సమస్యలు పెరిగిపోతున్నాయని అన్నారు.

రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కే రాంబాబు మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి ఇటీవలి కాలంలో కార్మికులకు ప్రయోజనాన్ని ఇవ్వడంలో విఫలమైందని, ఆరోగ్య సేవలు కనీసం అందుబాటులో లేవని విమర్శించారు. వైద్యుల నిర్లక్ష్యంతో పాటు, అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవని, అవినీతిని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. ఇంతలో, సూపర్డెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆసుపత్రి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి విజయవాడ డైరెక్టర్ గారితో మాట్లాడాలని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp