దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్ర వేసుకుంది. దీపావళి సందర్భంగా, గత రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా పేలిన బాణసంచా వల్ల కాలుష్యం భయంకరంగా పెరిగిపోయింది. బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు ఈ ఆదేశాలను పక్కన పెడుతూ, నిషేధాన్ని ఉల్లంఘించారు. ఫలితంగా, ఢిల్లీపై కాలుష్యం దుప్పటిలా పరుచుకుంది, ఈ ఉదయం ఆరు గంటల సమయానికి గాలి నాణ్యత ఇండెక్స్ (ఏక్యూఐ) రికార్డు స్థాయిలో 359 దాటిపోయింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఈస్ట్, వెస్ట్ ఢిల్లీని చుట్టి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బాణసంచా కాల్చి పండుగ జరుపుకొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) గణాంకాల ప్రకారం, బురారి క్రాసింగ్లో 394, జహంగీర్పురిలో 387, ఆర్కే పురంలో 395, రోహిణి 385, అశోక్ విహార్లో 384, మరియు అనేక ఇతర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వానంగా నమోదైంది. ఇది అంత్యంత నాసిరకం స్థాయిగా భావిస్తున్నారు.
ఢిల్లీ వాసులు నిషేధాన్ని పక్కనపెట్టి బాణసంచా కాల్చడంతో అనేక ప్రాంతాల్లో 2.5గా ఉన్న స్థాయులు ఆ తర్వాత క్యూబిక్ మీటర్కు 900 మైక్రోగ్రాములు వరకు పెరిగాయి, ఇది ఆమోదయోగ్యమైన పరిమితి కంటే 15 రెట్లు ఎక్కువ. రాత్రి ఒంటి గంట తర్వాత గాలిలో నాణ్యత క్రమంగా తగ్గిపోయినప్పటికీ, ప్రాథమిక గడువులోనే ఇది తీవ్రమైన స్థాయిలకు చేరుకుంది.