రైతు సేవా కేంద్రాల సదస్సుపై ఎంపీపీ ఆగ్రహం

Training for TADA staff to manage Rythu Seva Kendras was held without MPP or MPDO approval, sparking criticism. Local leaders demanded strict oversight and transparency in all procurement activities. Training for TADA staff to manage Rythu Seva Kendras was held without MPP or MPDO approval, sparking criticism. Local leaders demanded strict oversight and transparency in all procurement activities.

విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో గురువారం టి ఏ డీ ఏలకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు మరియు ఎంపీడీవో అనుమతి లేకుండానే కార్యాలయ తలుపులు తెరిచి జరపడం ఆయనను ఆగ్రహానికి గురిచేసింది. వైస్ ఎంపీపీ సారికి ఈశ్వర రావు కూడా ఈ తీరుపై మండిపడుతూ, చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల సహకారం లేకుండా సర్పంచులకు తెలియజేయకుండానే నియమించిన టి ఏ డీ ఏ ల పై కూడా విమర్శలు వచ్చాయి. పాత ప్రభుత్వంలో ప్రతి గింజను రైతు నుంచి కొనుగోలు చేయాలన్న నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రస్తుత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా రైతులకు ఇబ్బంది కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ చెప్పారు.

ఈ సమావేశంలో వ్యవసాయం సలహా మండలి అధ్యక్షులు లచ్చిరెడ్డి అప్పలనాయుడు, ఇతర గ్రామ సర్పంచులు, శిక్షణ పొందుతున్న టి ఏ డీ ఏలు, మెంటాడ సొసైటీ సీఈఓ వెంపడాపు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *