బెంగళూరులో నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు

Bengaluru Water Board has taken strict measures to prevent water wastage during summer. A fine of ₹5,000 will be imposed for wasting water. Bengaluru Water Board has taken strict measures to prevent water wastage during summer. A fine of ₹5,000 will be imposed for wasting water.

వేసవిలో నీటి కొరత కారణంగా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. గత సంవత్సరం ఎదుర్కొన్న నీటి సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈసారి పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. ఈ చర్యలలో ముఖ్యమైనది తాగునీటిని వృథా చేయకుండా నియంత్రించడం. వాహనాలు కడగడానికి, తోటలకు, నిర్మాణ పనులకు, ఫౌంటెయిన్‌లకు తాగునీటి వినియోగాన్ని అనుమతించకూడదు.

వాటర్ బోర్డ్ తాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాగునీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధించడానికి నిర్ణయించింది. మళ్లీ అదే తప్పు చేస్తే మరో ₹5 వేలు వడ్డించి, రోజుకు ₹500 చొప్పున ఫైన్ విధించాలని పేర్కొంది. ఈ చర్యలు వాటర్ బోర్డ్ యాక్ట్‌లోని సెక్షన్ 109 ప్రకారం తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

ఈ నిర్ణయం నగరంలో నీటి కొరత నివారించడానికే. బంగళూరులో ఉష్ణోగ్రతలు పెరిగి, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని వాటర్ బోర్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత వేసవిలో 14 వేల బోరుబావులు ఎండిపోయిన విషయం దృష్టిలో పెట్టుకుని, ఈసారి తాగునీటిని తాగుబోతుగా ఉపయోగించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది.

ఇందులో భాగంగా, బెంగళూరు నగరంలోని షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్ నిర్వాహకులు కూడా తాగునీటిని వృథా చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. జాగ్రత్తగా ఉండాలని, నీటి వృథాను గమనిస్తే వాటర్ బోర్డ్ కాల్ సెంటర్ నెంబర్ 1916 కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *