Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజగ్గయ్యపేటలో భారీగా గంజాయి పట్టివేత

జగ్గయ్యపేటలో భారీగా గంజాయి పట్టివేత

-

Chat on WhatsApp

NTR జిల్లా జగ్గయ్యపేట వద్ద భారీ గంజాయి పట్టుకున్నారు. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో భీమవరం టోల్ ప్లాజా వద్ద నిఘా నిర్వహించిన పోలీసులు ఈ ఘనత సాధించారు. రహస్య సమాచారం ఆధారంగా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, పోలీసుల నిఘాను గుర్తించి, తిరిగి విజయవాడ వైపు వెళ్లడం గమనించారు. కారు వేగంగా దూసుకెళ్లడం చూసి అనుమానించిన పోలీసులు కారును చేజ్ చేసి గౌరవరం సమీపంలోని పొలాల్లో ఆపారు.

అనంతరం కారు దుండగులు కారును వదిలి పారిపోయారు. కారును పరిశీలించిన పోలీసులు డిక్కీలో పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. గంజాయి తరలింపుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు గంజాయి అక్రమ రవాణా పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యలతో అక్రమ దందాలకు పెద్ద దెబ్బ తగులుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp