Maoist leader Hidma Encounter:మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma) ఎన్కౌంటర్తో భద్రతా బలగాలకు భారీ విజయం.ఎన్నేళ్లుగా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో భద్రతా బలగాలకు పెద్ద ముప్పుగా నిలిచిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
ఏపీ–తెలంగాణ సరిహద్దు(AP Telangana Border) ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన సమగ్ర ఆపరేషన్లో హిడ్మాతో పాటు మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.
అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధ తంత్రాలతో పలుసార్లు పోలీసులపై దాడులు నిర్వహించిన హిడ్మా, కేంద్ర–రాష్ట్ర దళాలకు చాలాకాలంగా సవాలుగా మారాడు.
ALSO READ:Shamshabad IVF Tragedy: కవలలు, భార్యను కోల్పోయిన భర్త ఆత్మ*హ*త్య
సుక్మా, బీజాపూర్, ములుగు, భద్రాద్రి కొల్లు గట్ల పరిధుల్లో అనేక నక్సల్ ఘటనల్లో అతని పాత్ర ఉన్నట్లు దర్యాప్తుల్లో బయటపడింది. హిడ్మాపై రూ.1 కోటి కంటే ఎక్కువ రివార్డు ప్రకటించబడింది.
అతని మృతితో నక్సల్స్ శక్తి కేంద్రానికి పెద్ద దెబ్బ తగిలిందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఆపరేషన్ను దళాలు అత్యంత కీలక విజయం గా పరిగణిస్తున్నాయి.
