భూవివాదం రక్తపాతంగా మారింది – ఒకరి మృతి, మహిళ తీవ్ర గాయాలు

A long-standing land dispute between two families in Ippalagudem, Kotharam led to a tragic incident, claiming one life and injuring a woman. Police are investigating the case. A long-standing land dispute between two families in Ippalagudem, Kotharam led to a tragic incident, claiming one life and injuring a woman. Police are investigating the case.

డిసెంబర్ 27న, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెంలో భూవివాదం కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు, మరో మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న రెండు కుటుంబాల మధ్య భూమి వివాదం తెరమీదకు వచ్చింది.

ఈ రోజు ఉదయం, డోంగిరి బుచ్చయ్య (55) అనే వ్యక్తి, సోదారి లింగయ్య కుటుంబంతో వివాదంగా ఉన్న భూమి వద్దకు వెళ్లారు. అక్కడ లింగయ్య, భార్య పద్మ, బుచ్చయ్య మధ్య మాటల గొడవ మొదలైంది. ఈ క్రమంలో బుచ్చయ్య ఆగ్రహంతో పద్మను పారతో కొట్టగా, ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

పద్మ గాయపడిన విషయాన్ని తెలిసిన ఆమె కుమారుడు సోదారి పవన్, ఆవేశంతో ఇంటికి బయలుదేరారు. మధ్యలో, కాటారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో బుచ్చయ్యను పవన్ చూసి కర్రతో బుచ్చయ్య తలపై కొట్టాడు. ఈ దాడి ఫలితంగా బుచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ రెండు కుటుంబాలు భూమిపై పోరాటం చేస్తున్నా, ఎవరికి సరైన భూ రికార్డులు లేవని తెలిసింది. గతంలో కూడా ఈ కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయని సీఐ నాగార్జున రావు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *