లగచర్లలో రైతుల అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం

Following the arrest of 30 farmers in Lagacharla, KTR condemned the police’s midnight action, questioning the treatment of farmers and standing in solidarity with their cause. Following the arrest of 30 farmers in Lagacharla, KTR condemned the police’s midnight action, questioning the treatment of farmers and standing in solidarity with their cause.

వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో 30 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు కరెంటు తీసేసి ప్రతి ఇంటిని తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ, అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. రైతులు ఏమైనా తీవ్రవాదులా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్య పాలనా? అని నిలదీశారు. ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకించినందుకు రైతులను అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు.

కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ లగచర్ల రైతులకు పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. రైతులు తమ భూములను, పచ్చని పొలాలను కాపాడుకోవాలనుకుంటే, అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *