Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు..?

Jubilee Hills Bypoll WHO WILL WIN IN Jubilee Hills Bypoll

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియనుండటంతో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీలైన కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మధ్యే పోటీగా ఉంటాయని అంచనా.

తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఫలితాల్లో కొంత భిన్నత్వం కనిపించే అవకాశం ఉంది. తుది ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోరు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే జరిగింది.

ఈ ముగ్గురి భవిష్యత్తును నిర్ణయించేది 4 లక్షలకు పైగా ఓటర్లే. ఇక జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉండటం ప్రత్యేకత. 2023 ఎన్నికల్లో 47.58% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ 47.16% శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు.

తక్కువ పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందన్న అంశంపై విశ్లేషకుల దృష్టి ఉంది. సాధారణంగా తక్కువ పోలింగ్ అధికార వ్యతిరేక వాతావరణానికి సంకేతమని ఒక వాదన ఉండగా, మరోవైపు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకి ఈ పరిస్థితి లాభిస్తుందని కొందరు భావిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎవరికీ ఊరటనిస్తాయో, ఎవరికీ ఆందోళన కలిగిస్తాయో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫలితాలపై రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *