బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు జపాన్ పెద్ద మద్దతు
భారతదేశ అభివృద్ధిలో భాగంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్కు జపాన్ ప్రభుత్వం కీలక భాగస్వామిగా నిలిచింది. టెక్నాలజీ, నిధులతో పాటు ఇప్పుడు రైళ్లను కూడా బహుమతిగా ఇస్తోంది.
పరీక్షల కోసం రెండు బుల్లెట్ రైళ్లు బహుమతి
ఈ కారిడార్లో రైలు మార్గాల పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను భారత్కు బహుమతిగా అందించనుంది. ఈ రైళ్లు ప్రయోగాత్మక ప్రయాణాల కోసం ఉపయోగించనున్నారు. 2026లో భారత్కు చేరుకుంటాయని అంచనా.
అధిక వేగం, అత్యాధునిక సదుపాయాలు
ఈ రైళ్లలో ఒకటైన E5 షింకన్సెన్ను 2011లో ప్రారంభించారు. ఇది అత్యాధునిక సదుపాయాలతో పాటు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రయాణికులకు సౌకర్యం, భద్రత కలిగించే విధంగా దీనిని డిజైన్ చేశారు.
బుల్లెట్ రైల్ దిశగా కీలక అడుగు
ఈ బహుమతి భారత్లో బుల్లెట్ రైల్ వృద్ధికి మరింత బలాన్ని ఇస్తుంది. ప్రయాణ వేగం, నాణ్యత పరంగా ఇది భారత రైలు రంగానికి మార్గదర్శకంగా నిలవనుంది. భారత-జపాన్ సంబంధాల్లో ఇది మరో మైలురాయిగా చెప్పవచ్చు.
