Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeOthersభారతదేశంలో తొలి ఎయిర్ ట్యాక్సీ 'శూన్య' ఆవిష్కరణ!

భారతదేశంలో తొలి ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ ఆవిష్కరణ!

-

Chat on WhatsApp

భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ నమూనాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ‘శూన్య’ అనే ఎయిర్ ట్యాక్సీ ప్రదర్శించారు. ఇది పూర్తిగా స్థానికంగా అభివృద్ధి చేయబడిన స్వదేశీ ఎయిర్ ట్యాక్సీగా వినియోగదారులకు త్వరితగతిన ప్రయాణ సేవలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఎయిర్ ట్యాక్సీని ప్రాథమికంగా బెంగళూరు నగర పరిధిలో వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2028 నాటికి దీన్ని ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారంగా దీనిని అభివృద్ధి చేస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ప్రయాణ సమయంలో గణనీయమైన తగ్గింపును సాధించవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

‘శూన్య’ పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారంగా పనిచేస్తుంది. దీని రూపకల్పన, గుణాత్మకతను మెరుగుపరిచేందుకు భారతదేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ సంస్థల మద్దతు తీసుకున్నామని కంపెనీ తెలిపింది. చిన్న దూరాల ప్రయాణాలను వేగంగా, సురక్షితంగా పూర్తి చేసేందుకు దీన్ని రూపొందించారు. దీనిలో ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, ఆటోమేటెడ్ కంట్రోల్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

భవిష్యత్తులో ఇది మిగిలిన మెట్రో నగరాలకు విస్తరించే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఎయిర్ ట్యాక్సీ వాణిజ్య సేవల కోసం అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలను పొందేందుకు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. 2028 నాటికి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Voters casting their ballots in Kerala, Assam, and Puducherry during state elections

Elections | ప్రశాంతంగా 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్…ఇప్పటివరకు ఎంతంటే ?

Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌లో ఎండను పక్కన పెట్టి ఓటర్లు బూత్‌లకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు...
- Advertisement -
Chat on WhatsApp