Sunday, March 22, 2026
Google search engine
HomeAndhra Pradeshకురుపాం జిసిసి గోదాంలో అగ్ని ప్రమాదం, లక్షలలో నష్టం

కురుపాం జిసిసి గోదాంలో అగ్ని ప్రమాదం, లక్షలలో నష్టం

-

Google search engine

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మండెంఖల్ జిసిసి గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించి, నరమామిడి చెక్క పిక్కలు, చింతపండు, బియ్యం వంటి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న జిసిసి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

సమీప గ్రామస్థులు గుమ్మలక్ష్మిపురం ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించగా, అగ్ని మాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లింది.

డివిజనల్ మేనేజర్ వి. మహేంద్ర కుమార్ ప్రకారం, అగ్ని ప్రమాదంలో దాదాపు 5000 క్వింటాల నల్ల జీడి పిక్కలు దగ్ధమవడంతో సుమారు 15 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine