Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeMedchal MalkajgiriMalkajgiriబంగారం తిరిగి ఇవ్వలేని కూతురు మీద వృద్ధ దంపతుల ధర్నా

బంగారం తిరిగి ఇవ్వలేని కూతురు మీద వృద్ధ దంపతుల ధర్నా

-

Chat on WhatsApp

మల్కాజిగిరి సర్కిల్ వాణీనగర్‌లో శివమ్మ, మల్లయ్య అనే వృద్ధ దంపతులు తమ కుమార్తె బాలమణి నుంచి 30 తులాల బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఇద్దరూ రెండు సంవత్సరాల క్రితం తమ ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని తమ బంగారాన్ని కుమార్తెకు దాచిపెట్టమని అప్పగించారు. కానీ అప్పటి నుండి ఆ బంగారం తిరిగి ఇవ్వలేదు.

వారికి అనేకసార్లు బంగారం అడిగినా ఫలితం లేకపోవడంతో, మానవహక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వారి సహకారంతో కుమార్తె ఇంటి ముందు ధర్నా చేసారు. ఇప్పటి వరకు పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని వాపోయిన వృద్ధ దంపతులు, తమ కూతురే ఇలాంటి వ్యవహారం చేయడం విచారకరమని, వారిద్దరూ మళ్లీ తమ బంగారం తీసుకోవాలని వేడుకున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp