Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIగొర్రెలు, మేకలకు రక్త నమూనాలు సేకరించిన డాక్టర్ హిమజా

గొర్రెలు, మేకలకు రక్త నమూనాలు సేకరించిన డాక్టర్ హిమజా

-

Chat on WhatsApp

పశువైద్యశాఖ డాక్టర్ ఎం.హిమజా పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, 2024-12-19 ఉదయం 9 గంటలకు అనకాపల్లి జిల్లా, V. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలోని బయలుపూడి సింగవరం, జైతవరం, అర్జునిగిరి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా, పి.పి.ఆర్ వ్యాక్సిలేషన్ (చెడపాలుడు వ్యాధి టీకాలు) పనితీరు పరీక్షించుటకై ఆమె గొర్రెలు మరియు మేకల రక్త నమూనాలు సేకరించారు.

ఈ పరీక్షలో భాగంగా, విశాఖపట్నం ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు డాక్టర్ కెమెరాసించి నమూనాలు సేకరించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంలో, ఆవులు గేదెలలో దూడలకు 4 నెలల నుండి 8 నెలల వయసులో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. అలాగే, 3 నెలలు దాటిన ఆవుల్లో టీకాలు వేయించుకోవాలని తెలిపారు.

జూన్ నెలలో చిటిక వ్యాధి టీకాలు, జూలై నెలలో నీలి నాలుక వ్యాధి (బ్లుటన్ వ్యాధి) టీకాలు, సెప్టెంబరులో చెడపాలుడు వ్యాధి టీకాలు, అక్టోబర్, నవంబర్లో గొర్రెలు, మేకలలో బ్రూసిలేసిస్ వ్యాధి టీకాలు వేయించుకోవాలని చెప్పారు. వార్షికంగా 3 సార్లు, మార్చి, ఆగస్టు, డిసెంబర్‌లో టీకాలు వేయించుకోవాలని తెలిపారు.

ఇవి సరైన విధంగా నిర్వహించడానికి, తొలుగా గొర్రెలు, మేకల పేడలను ప్రయోగశాలల్లో పరీక్షించి, అవగాహన పెంచి, వాటి ఆధారంగా మందులు పట్టాలని సూచించారు. ఇందు ద్వారా, ఈ వ్యాధులను నివారించడమే కాక, గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయకులు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rahul gandhi congress senior leaders disagreement bjp reaction

Rahul Gandhi | యుద్ధ, ఇంధన సమస్యలపై రాహుల్ vs సీనియర్ కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, దేశంలో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలను రాహుల్ గాంధీ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు రాహుల్ అభిప్రాయాలకు...
- Advertisement -
Chat on WhatsApp