రుద్రారం గ్రామంలో కార్తీక మాసం ఉత్సవాలు, అన్నదానం
నారాయణఖేడ్ మండలంలోని రుద్రారం గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం శ్రీ సర్వేశ్వర సహిత గిరిజా దేవి కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర ఉత్సవంలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆకాశ జ్యోతి ప్రజ్వలనం చేసినారు. దీపాల ప్రసాదంతో ఆలయ ప్రాంగణం వెలుగులతో మారింది. అలాగే, ఈ పుణ్యకార్యక్రమం ఘనంగా జరపడం ద్వారా గ్రామ ప్రజలు ఆధ్యాత్మికతలో ఆనందం పొందారు….
