నిర్మల్ జిల్లా బైంసా మండలంలో గుండెపోటుతో మృతి చెందిన రైతు భార్యకు రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేశారు.

క్రాప్ లోన్ బీమా ద్వారా మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత

నిర్మల్ జిల్లా బైంసా మండలం దెగాం గ్రామానికి చెందిన మార్రె ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభాకర్ క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు ప్యాక్స్ బీమా పొందారు. ప్రభాకర్ మృతి తరువాత బీమా ద్వారా వచ్చిన రూ. 2 లక్షల చెక్కును ఆయన భార్య రాత్నకు ప్యాక్స్ చైర్మన్ అమెడ దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ సెక్రటరీ రాజేందర్ కూడా పాల్గొన్నారు. ప్యాక్స్ చైర్మన్ మాట్లాడుతూ, రైతులు క్రాప్ లోన్ తీసుకునే సమయంలో బీమా చేయించుకోవడం…

Read More
బైంసా పట్టణంలో రాజీవ్ నగర్‌కు చెందిన మంజుల నడుస్తూ ఉన్నప్పుడు, బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె బంగారు గొలుసు అపహరించారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బైంసా పట్టణంలో బంగారు గొలుసు అపహరణ

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని రాజీవ్ నగర్ కు చెందిన మంజుల ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి నడుచుకుంటూ వెళుతుండగా దుర్ఘటన జరిగింది. ఈ సమయంలో, బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి రెండు అంతుల బంగారు గొలుసును అపహరించారు. ఈ సంఘటనలో మంజుల కింద పడటంతో ఆమెకు గాయాలు అయ్యాయి. గాయాలైన మంజులను చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. వారు ఆమెను దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందించబడింది….

Read More
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీపై జిల్లా విశ్వహిందూ పరిషత్ నేతలు నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్‌కి మద్దతు ప్రకటిస్తూ, సరైన విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

తిరుమల లడ్డు కల్తీ పై నిరసన

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీకి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, వారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం మహాపాపంగా తయారు చేయబడింది అని ఆరోపించారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బోర్డు ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి పూర్తి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ, నెయ్యి…

Read More
ముధోల్ తాలూకా బోసి గ్రామంలో 64 ఏళ్లుగా కర్ర వినాయకుడికి పూజలు, మొక్కలు సమర్పిస్తే కోరికలు తీరిస్తారని భక్తుల నమ్మకం.

64 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న వరసిద్ధి వినాయకుడు

కోరుకున్న కోరికలు తీర్చే గణనాథుడు వరసిద్ధి వినాయకుడని ఆ గ్రామస్తుల నానుడి, వివరాల్లోకి వెళ్ళితే నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా తానూరు మండలం బోసి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని గత 64 సంవత్సరాలుగా కర్ర వినాయక విగ్రహం వరసిద్ధి వినాయకుని ప్రతిష్టాపించేసి పూజలు చేస్తున్నారు. గ్రామంలో వరసిద్ధి వినాయకుని అండదండలతో దాదాపు ఇంటికో ఉద్యోగం, పాడిపంటలతో ప్రతి ఇల్లు సౌభాగ్యలతో నెలకొని ఉందని అక్కడి పండితులు వాపోతున్నారు. 11 రోజులు పూజలు అందుకున్న తరువాత…

Read More
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయిమాధవ్ నగర్ లో జరిగిన దొంగతనని చేధించిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎఎస్పీ అవినాష్

48 గంటల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయిమాధవ్ నగర్ లో జరిగిన దొంగతనని చేధించిన పోలీసులు. ముధోల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భైంసా ఎఎస్పీ అవినాష్..మెదరోల్లా వెంకటేష్ కుటుంబంతో హైదరాబాదు వెళ్లిన రోజు అతని ఇంట్లో నే అద్దె కు ఉన్న భార్యాభర్తలు దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు వారి నుండి 7 తులాల బంగారం ,నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. దొంగతనం జరిగిన 48 గంటలో…

Read More