ఐజాలో కలెక్టర్ పరిశీలించిన రైతు భరోసా ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బి.వై.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐజా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అర్హుల ఎంపిక ప్రాతిపదిక, సేకరించిన వివరాల ప్రామాణికత, రిజిస్టర్లలో నమోదు వంటి అంశాలను అధికారులతో సమీక్షించారు. ప్రతి మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా పూర్తవ్వాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన…
