కోల్‌కతా హత్యాచార ఘటనలో సంచ‌ల‌న విషయం

కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సంజయ్‌ రాయ్‌కి సంబంధించిన మ‌రో సంచ‌ల‌న‌ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్ప‌డే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి, మరో సివిక్‌…

Read More

ముంబై సమీపంలోని బద్లాపూర్ స్కూల్‌లో చిన్నారులపై అత్యాచారం

ముంబై సమీపంలోని బద్లాపూర్‌లో ఓ స్కూల్‌లో నర్సరీ చదువుతున్న ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై అత్యాచారం ఘటన నగరాన్ని కుదిపేసింది. ఓ ప్రముఖ స్కూల్‌లో చదువుతున్న బాధిత చిన్నారులపై అందులో పనిచేస్తున్న స్వీపరే అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.  ఆగస్టు 12, 13 తేదీల్లో వరుసగా ఈ ఘటన జరిగినా స్కూలు యాజమాన్యం ఫిర్యాదు చేయడంలో అలసత్వం వహించిందంటూ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. నేడు బద్లాపూర్‌లో బంద్ పాటించారు. వేలాదిమంది స్కూలు వద్దకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు….

Read More

జోధ్‌పూర్‌లో చిన్నారిపై దారుణ అత్యాచారం

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, నిందితులు ఎలాంటి భీతి లేకుండా నిర్భయంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మరో ఘటన రుజువు చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని…

Read More

అన్నపూర్ణ స్టూడియోస్ పై ఫేక్ ప్రకటన: అభ్యర్థుల పట్ల హెచ్చరిక

తమ ప్రొడక్షన్ హౌస్ పేరుపై కొత్త నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థకు నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. అగ్ర నిర్మాణ సంస్థల పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ ఫేక్ ప్రకటన వచ్చింది. హీరో, హీరోయిన్,…

Read More

కేరళలో కొండచరియలు విరిగిపడడం: 80 మృతదేహాలు, 600 మంది కార్మికుల ఆచూకీ లభ్యం

కేరళలోని వయనాడ్ జిల్లాలో 600 మంది వరకు వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ తోటలలో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది కార్మికులు కనిపించకుండా పోయారు. స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ కూడా పని చేయడం లేదు. ముండకై ప్రాంతంలోని హారిసన్ మలయాళి ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పని చేసేందుకు వీరంతా వచ్చారు. వీరు…

Read More