గిద్దలూరు రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి
గిద్దలూరు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదంలో మృతుడు గిద్దలూరు జగనన్న కాలనీకి చెందిన అనుముల శ్రీనివాసులు (50) గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల…
