ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు హక్కు వినియోగించాలి
పార్వతిపురం మన్యం జిల్లాలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఆర్.సి.ఎం కార్యాలయ సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైనదని, దాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు తీర్చిదిద్దటంలో ఓటు హక్కు కీలక భూమిక పోషిస్తుందని, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్లు కట్టుబడి…
