MLA Dr. Chadalavada Aravind Babu inaugurated a battery vehicle at Kotappakonda for elderly and disabled visitors.

కోటప్పకొండకు బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాన్ని అందించారు. ఈ వాహనాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావేళ్ల జ్ఞాన కోటేశ్వరరావు (జ్ఞానీ) విరాళంగా ఇచ్చారు. నరసరావుపేట శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద బాబు ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయోవృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు, మహిళలు సులభంగా స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వాహనం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు….

Read More
Pedakurapadu CI Venkataravu clarified that police had no involvement in the Vice Chairman election and denied abduction allegations.

వైస్ చైర్మన్ ఎన్నికపై పోలీసులపై తప్పు ఆరోపణలు – సీఐ

పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ వెంకటరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందని వివరించారు. ఈనెల 17, 18 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఎన్నికలలో పోలీసులు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 3, 4 తేదీల్లో కోరం లేకపోవడానికి పోలీసుల ప్రమేయం…

Read More
ACB raids in Chilakaluripet. MEO Lakshmi caught red-handed accepting a ₹30,000 bribe.

చిలకలూరిపేటలో లంచం తీసుకుంటూ ఎంఈఓ పట్టివేత!

చిలకలూరిపేటలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల అవినీతి సమాచారంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అక్కడ సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు బయటపడ్డాయి. దాడుల సందర్భంగా ఎంఈఓ లక్ష్మీ రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే ఆమెపై కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకున్న ఆధారాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం…

Read More
Inter practical exams in Palnadu start on February 10. A total of 11,509 students will attend across 62 exam centers.

పల్నాడు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ!

పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ ఎడ్యుకేషనల్ అధికారి లీలావతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూనియర్ కళాశాలలో అధ్యాపకులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి, మార్గదర్శకాలను వివరించారు. ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థుల సంఖ్య 11,509 కాగా, ప్రతి కేంద్రంలో సమర్థవంతమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు….

Read More
The AP High Court ordered an FIR against former minister Vidadala Rajini over 2019 custodial torture allegations against TDP leader Pilli Koti.

మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదు చేయాలన్న హైకోర్టు

టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2019లో సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకే చిలకలూరిపేటలో తనపై చిత్రహింసలు జరిగాయని పిల్లి కోటి ఆరోపించారు. అయితే, పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని కోటి హైకోర్టును ఆశ్రయించారు. పిల్లి కోటి ఆరోపణల ప్రకారం, చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో ఐదురోజులపాటు తనను చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ, మాజీ మంత్రి…

Read More
A massive fire broke out behind Kala Mandir Shiva Temple. Firefighters are working to control the flames.

కళామందిర్ శివాలయం వద్ద అగ్ని ప్రమాదం కలకలం

కళా మందిర సెంటర్‌లోని శివాలయం వెనుక భాగంలో అగ్ని ప్రమాదం సంభవించి కలకలం రేపింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైరింజన్లు నీరు స్ప్రే చేస్తున్నాయి. భవనానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, కానీ ఘటన స్థలంలో తీవ్రమైన పొగ వ్యాపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల…

Read More
Four Panchayat Secretaries in Palnadu received show-cause notices from the collector for failing to hoist the national flag on Republic Day.

గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరపెట్టని సెక్రటరీలకు నోటీసులు

గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ చేయలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తీవ్రంగా స్పందించారు. నూజెండ్ల, చింతల చెరువు, ఐనవోలు, ముప్పరాజుపాలెం పంచాయతీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జాతీయ పతాకావిష్కరణ చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా భావించిన కలెక్టర్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ నిబంధనలను అనుసరించకపోవడం అధికారుల…

Read More