Palnadu district schools will follow single-session timings until April 23, as per education department orders.

పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులు అమలు

పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులను అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ ప్రకటించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మాత్రం పరీక్షలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల…

Read More
YSRCP's 15th Formation Day celebrations were held grandly in Gurazala, Piduguralla.

గురజాలలో వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, డా. చింతలపూడి అశోక్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న పార్టీ అని, నవరత్నాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మార్గం…

Read More
A preparatory meeting for JanaSena’s anniversary was held in Gurazala with leaders, activists, and Veera Mahilas attending in large numbers.

గురజాలలో జనసేన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం, ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు సూచన మేరకు, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. పిడుగురాళ్ల పట్టణంలోని కేఎం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పొన్నూరు మాజీ శాసనసభ్యులు, నరసరావుపేట పార్లమెంటరీ సమన్వయకర్త కిలారు రోశయ్య హాజరై, ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిలారు రోశయ్య మాట్లాడుతూ, మార్చి 14న…

Read More
Cheated in online betting, a welfare assistant from Dachepalli pleads for help in a distressing selfie video, fearing for his family's survival.

ఆన్లైన్ బెట్టింగ్ మోసంతో దాచేపల్లి అసిస్టెంట్ కష్టాలు

దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ తన ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో భారీగా నష్టపోయాడు. ప్రభుత్వ స్కీం ద్వారా వచ్చిన పెన్షన్ డబ్బులు బెట్టింగ్‌కు వాడటంతో, తిరిగి చెల్లించలేని స్థితిలో చిక్కుకున్నాడు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న లక్ష్మీప్రసాద్, తన కుటుంబం రెండు రోజులుగా ఆకలితో ఉందని వీడియోలో తెలిపారు. వీడియోలో కలెక్టర్, దాచేపల్లి కమిషనర్‌ను ఉద్దేశించి క్షమాపణలు కోరారు. తల్లిదండ్రులను వేడుకొని డబ్బులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని లేకపోతే తమ కుటుంబానికి మిగిలిందేమీ లేదని ఆవేదన వ్యక్తం…

Read More
MLA Dr. Chadalavada Aravind Babu inaugurated a battery vehicle at Kotappakonda for elderly and disabled visitors.

కోటప్పకొండకు బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాన్ని అందించారు. ఈ వాహనాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావేళ్ల జ్ఞాన కోటేశ్వరరావు (జ్ఞానీ) విరాళంగా ఇచ్చారు. నరసరావుపేట శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద బాబు ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయోవృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు, మహిళలు సులభంగా స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వాహనం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు….

Read More
Pedakurapadu CI Venkataravu clarified that police had no involvement in the Vice Chairman election and denied abduction allegations.

వైస్ చైర్మన్ ఎన్నికపై పోలీసులపై తప్పు ఆరోపణలు – సీఐ

పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ వెంకటరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందని వివరించారు. ఈనెల 17, 18 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఎన్నికలలో పోలీసులు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 3, 4 తేదీల్లో కోరం లేకపోవడానికి పోలీసుల ప్రమేయం…

Read More
ACB raids in Chilakaluripet. MEO Lakshmi caught red-handed accepting a ₹30,000 bribe.

చిలకలూరిపేటలో లంచం తీసుకుంటూ ఎంఈఓ పట్టివేత!

చిలకలూరిపేటలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల అవినీతి సమాచారంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అక్కడ సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు బయటపడ్డాయి. దాడుల సందర్భంగా ఎంఈఓ లక్ష్మీ రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే ఆమెపై కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకున్న ఆధారాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం…

Read More