పెద్ద తుంబలంలో శోభాయమానంగా సీతారాముల కళ్యాణం
ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుంబలం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై, భక్తిరసంలో మునిగిపోయారు. ఈ పుణ్యకార్యక్రమంలో ఆదోని శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ పట్టణ నాయకుడు విట్ట రమేష్, డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు, శ్రీ నరసింహ ఈరన్న స్వామి, నాగరాజు…
