Adoni MLA Parthasaradhi expressed concern over the neglect of check dam approvals in his constituency during a district development review meeting.

చెక్‌డ్యామ్‌లపై చిన్నచూపు ఎందుకు? ఆవేదన వ్యక్తం చేసిన పార్థసారధి

కర్నూలులో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష మండల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తన నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెక్‌డ్యాముల మంజూరులో జరిగిన చిన్నచూపుపై కఠినంగా స్పందించారు. ఆదోనికి తగినంత ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది స్థానిక ప్రజలకు అన్యాయం చేస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమీక్ష సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్,…

Read More
A grand Sitarama Kalyanam was held at Peddathumbalam under the guidance of Sri Narasimha Eranna Swamy. The event saw huge public participation.

పెద్ద తుంబలంలో శోభాయమానంగా సీతారాముల కళ్యాణం

ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుంబలం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై, భక్తిరసంలో మునిగిపోయారు. ఈ పుణ్యకార్యక్రమంలో ఆదోని శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ పట్టణ నాయకుడు విట్ట రమేష్, డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు, శ్రీ నరసింహ ఈరన్న స్వామి, నాగరాజు…

Read More
A 4-year-old girl tragically fell from a terrace in Kosigi, Kurnool, and passed away. The incident has left her parents and villagers heartbroken.

కోసిగి మండలంలో ఇంటి మిద్దెపై నుంచి జారి చిన్నారి మృతి

కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. లంక నాగలక్ష్మి – ఆంజనేయులు దంపతుల కూతురు శ్రీదేవి (4) ఆదివారం ఉదయం తమ ఇంటి మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని వెంటనే కోసిగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి తీవ్రంగా గాయపడడంతో వైద్యులు ఆమెను పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరు…

Read More
A grand festival was held at the newly built Bangaramma Temple in Ballakal village, Adoni Mandal.

బల్లకల్ గ్రామంలో బంగారమ్మ దేవాలయ మహోత్సవం ఘనంగా

కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లకల్ గ్రామంలో బంగారమ్మ అవ్వ కొత్త దేవాలయ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో కుల మతాలకు అతీతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్థుల ఐక్యతకు ఇది చిహ్నంగా నిలిచింది. ఈ మహోత్సవంలో చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామమంతా ఉత్సాహంగా పాల్గొంది. దేవర మహోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆలయ నిర్మాణానికి మూడు లక్షల…

Read More
Excise officials seized and destroyed ₹12 lakh worth of illegal Karnataka liquor in Kosigi Mandal.

కోసిగి మండలంలో 12 లక్షల విలువైన మద్యం ధ్వంసం

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మద్యం స్వాధీనం చేసుకొని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. మొత్తం రూ.12 లక్షల విలువైన మద్యం నాశనం చేసినట్లు ఆయన తెలిపారు. కోసిగి, కౌతాళం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా అక్రమ మద్యం రవాణా జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ…

Read More
CCTV cameras are playing a key role in rural safety. A new CCTV store was inaugurated in Emmiganoor by the DSP.

నేర నియంత్రణకు సీసీ కెమెరాలు.. ఎమ్మిగనూరులో కొత్త దుకాణం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మిగనూరు డీఎస్పీ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భద్రత పెంపు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఇవి బలమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య తగ్గుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా వాటిని తమ నివాసాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూల్ బైపాస్ రోడ్‌లో కొత్త సీసీ కెమెరా దుకాణాన్ని డీఎస్పీ, టౌన్ సీఐ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ…

Read More
Bank employees in Adoni protested against govt. negligence and called for a two-day strike demanding recruitment, workload reduction, and reforms.

ఆదోనిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన, సమ్మెకు పిలుపు

ఆదోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎదురుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత లేకపోవడం, పెరిగిన పని ఒత్తిడి ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు K రవికుమార్, R రాజశేఖర్, NCBE నాయకులు నాగరాజు, హరినాథ్, అనుమన్న…

Read More