బుడమేరు డైవర్షన్ కెనాల్ విషయంలో వైసీపీ విఫలమైందని మంత్రి
బుడమేరు డైవర్షన్ కెనాల్ను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శాసన మండలిలో వాస్తవాలను వెల్లడిస్తూ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని అన్నారు. ఈ కెనాల్ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. బుడమేరుకు వరదలు రావడంపై ఆయన మరింత బహిరంగంగా స్పందించారు. ఒకేసారి 15 వేల క్యూసెక్కుల నీరు కెనాల్లో ప్రవేశించడంతో గండ్లు పడి వరదలు వచ్చాయని…
