A civet cat roaming at night in Kodurupadu was safely caught by locals and handed over to forest officials.

కోడూరుపాడులో పూనుగు పిల్లి కలకలం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో పూనుగు పిల్లి దర్శనం గ్రామస్థులను ఆశ్చర్యంలో ముంచింది. రాత్రి సమయంలో ఇది గ్రామంలో సంచరిస్తుండగా, కొందరు స్థానికులు గమనించారు. జంతువును వలవేసి పట్టుకునేందుకు వారు జాగ్రత్తగా ప్రయత్నించారు. చివరకు పూనుగు పిల్లిని సురక్షితంగా బంధించి భద్రపరిచారు. ఈ ప్రక్రియలో గ్రామస్థురాలు ఆళ్ల భాను కీలక పాత్ర పోషించారు. పూనుగు పిల్లిని పట్టుకున్న అనంతరం ఆమె అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జంతువు ఎటువంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా…

Read More
Fire broke out at Little Lights Orphanage in Gannavaram. Six students injured and shifted to hospital. Locals helped control the fire.

గన్నవరంలో అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం – ఆరుగురికి గాయాలు

గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రమంలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉంటుండగా, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కొంతమంది విద్యార్థులు ఆశ్రమంలోనే చిక్కుకుపోయారు. వీరిని స్థానికులు తలుపులు పగలగొట్టి బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా…

Read More
Panchayat land encroachment in Vijayawada Ambapuram sparks protest. Villagers urge officials to take action.

విజయవాడ అంబాపురంలో రూ.20 కోట్ల పంచాయతీ స్థలం కబ్జా

విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్‌ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో రూ.20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టిడిపి నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. లే అవుట్‌లో కామన్ స్థలంగా వదిలిన 2,226 గజాల స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి. జకరయ్య అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. అక్రమ…

Read More
In the Gannavaram TDP office attack case, complainant Satyavardhan filed an affidavit stating he has no connection. Hearing postponed to today.

గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో కీలక మలుపు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 45 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా సత్యవర్థన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనను పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం…

Read More
MLA Ramu interacts with Gudivada residents, discusses water issues, and directs officials for solutions.

గుడివాడలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల పర్యటన

గుడివాడ శివారు ధనియాలపేటలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే రాము వెంటనే అధికారులను పిలిపించి తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గుడివాడలో…

Read More
CCS police recovered 310 mobiles in Krishna district. Using MMTS technology, they tracked and returned the stolen devices to the owners.

కృష్ణా జిల్లాలో 310 మొబైళ్ల రికవరీ చేసిన సీసీఎస్ పోలీసులు

కృష్ణా జిల్లాలో మొబైల్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన సీసీఎస్ పోలీసులు ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ ద్వారా 310 మొబైళ్లను రికవరీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ నేతృత్వం వహించారు. గుడివాడ సీసీఎస్ 175, పెనమలూరు సీసీఎస్ 83, బందరు సీసీఎస్ 52 మొబైళ్లను రికవరీ చేయగా, మొత్తం 36 లక్షల విలువైన మొబైళ్లను బాధితులకు అందజేశారు. బాధితులకు వారి మొబైళ్లను తిరిగి అప్పగిస్తూ, ఎస్పీ గంగాధర్ మాట్లాడుతూ, ప్రజలు తమ మొబైళ్లు…

Read More
Vigilance officials conducted surprise vehicle checks near Puligadda Toll Gate in Avanigadda mandal.

అవనిగడ్డలో ఆకస్మిక వాహన తనిఖీలు

మంగళవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ టోల్ గేట్ సమీపంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక వాహన తనిఖీలను నిర్వహించారు. వారికీ అందిన సమాచారం ప్రకారం, మచిలీపట్నం నుండి హైవే మీదుగా కర్ణాటక, హిందూపురం వైపు వెళ్ళుతున్న రెండు లారీలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ లారీలను అడ్డుకుని అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. రెవిన్యూ, పీడీఎస్ అధికారులు వాహనాలను పరిశీలించి, ఒక లారీలో 250 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం గుర్తించారు. ఈ బియ్యం స్వాధీనం చేసుకోబడింది. మరో లారీలో…

Read More