తాళ్లరేవులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై, ఎన్నికల ప్రణాళికలను సమీక్షించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓట్లను సమర్థంగా ఉపయోగించేందుకు టీడీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 30 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించడంతో…
