Pawan Kalyan honouring the blind women’s cricket world cup winning team in Mangalagiri

AP Deputy CM Pawan Kalyan | ప్రపంచకప్ విజేత,మహిళా అంధుల క్రికెట్ జట్టుకు ఘన సన్మానం

Pawan Kalyan: ప్రపంచకప్ విజేతలుగా నిలిచి మహిళలు దేంట్లోను తక్కువ కాదని నిరూపించి భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి మరియు యువతకు స్ఫూర్తిగా నిలిచినా మన అంధుల మహిళా క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో పవన్ ప్రత్యేకంగా సమావేశమై అభినందనలు తెలిపారు. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షల చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర,…

Read More
నారా లోకేష్ దివ్యాంగుడికి ట్రై స్కూటీ అందజేస్తూ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్

మంగళగిరి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్…ఇక వివరాల్లోకి వెళ్తే  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావు ఆటోలో పాలకొల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు అండగా నిలిచారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో లోకేష్ స్వయంగా వెంకటేశ్వరరావును కలుసుకొని, ఇచ్చిన హామీ ప్రకారం ట్రై స్కూటీని…

Read More
హోంమంత్రి వంగలపూడి అనిత ఈగల్‌ వ్యవస్థపై వ్యాఖ్యలు

ఏడాదిన్నరలోనే  జీరో  గంజాయి రాష్ట్రంగా చేసాం:హోంమంత్రి వంగలపూడి అనిత

మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ మరియు గంజాయి నిర్మూలనలో ఈగల్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఈగల్‌ వ్యవస్థను ప్రారంభించిన ఏడాదిన్నరలోనే జీరో గంజాయి రాష్ట్రంగా చేసాం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పాఠశాల స్థాయిలోకి తీసుకువెళ్తున్నామని, డ్రగ్స్‌ ప్రభావంతో నష్టపోయిన యువతను తిరిగి సాధారణ జీవితానికి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. గతంలో గంజాయికి బానిసైన యువతను చూసి తల్లిదండ్రులు…

Read More
Ganja Racket Targeting Students Busted in Mangalagiri. Mangalagiri rural police arrest a ganja-selling gang; 9 held, 2 kg of ganja seized.

మంగళగిరిలో కాలేజీ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

మంగళగిరి మండల పరిధిలో కాలేజీ యువకులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గ్రామీణ సీఐ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, కాజా గ్రామంలో యువకులు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందిన వెంటనే నిఘా ఉంచి, నంబూరు కెనాల్ వద్ద 9 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతుందని…

Read More
Nara Lokesh and his wife attended the Mangalagiri Narasimha Kalyanam and offered silk robes.

మంగళగిరి నరసింహస్వామి కల్యాణంలో నారా లోకేష్ దంపతులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. వేద మంత్రోఛ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. వేదపండితులు స్వామివారికి విష్వక్షణ ఆరాధన,…

Read More
Minister Nara Lokesh attended the Muthyalamma and Pothuraju idol installation ceremony in Yerrabalem and offered special prayers.

ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో లోకేష్

మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న లోకేష్‌కు కుటంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి నామస్మరణలతో భక్తులతో కలిసి…

Read More
Nara Bhuvaneshwari visited Akshaya Patra's kitchen in Mangalagiri and highlighted the midday meal program's importance. Inaugurated rice cleaning machine.

నారా భువనేశ్వరి అక్షయపాత్ర సందర్శన

మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” పథకం ద్వారా 30,000 మంది పిల్లలకు ఇక్కడి నుంచి భోజనం అందిస్తారని చెప్పారు. ఇందులో 25 వాహనాల ద్వారా ఇన్సులేటెడ్ కంటైనర్లలో భోజనం సరఫరా జరుగుతుందని, ప్రభుత్వం-సహాయక పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాల్లో అక్షయపాత్ర కీలకపాత్ర పోషిస్తోందని…

Read More