ఏలూరులో మహిళా దినోత్సవ వేడుకలు – ఉచిత గ్యాస్ సంకల్పం
ఏలూరులో సీఆర్ఆర్ కాలేజీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఏపీ పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, మహిళల అభివృద్ధి, భద్రత ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని వెల్లడించారు. మహిళలు అత్యవసర సమయంలో 181 టోల్ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదు. ఏపీలో…
