
రైతు ఆత్మహత్య ఘటనపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం పంచాయితీ పిచ్చలవాండ్లపల్లెకు చెందిన రైతు నరసింహులు (60) పొలానికి దారి నిరోధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యర్థి రెడ్డెప్ప నాయుడు పొలానికి దారి ఇవ్వకపోవడంతో తన వ్యవసాయ బోరు వద్ద ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై మదనపల్లి తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. అయితే, నరసింహులు మృతికి కారణమైన రెడ్డెప్ప నాయుడుపై హత్య కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్…