విశాఖలో ఆర్టీసీ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి కలకలం

An unidentified man allegedly attacked women with acid on an RTC bus in Visakhapatnam. Police are investigating the incident and the victims' condition. An unidentified man allegedly attacked women with acid on an RTC bus in Visakhapatnam. Police are investigating the incident and the victims' condition.

విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గిరిజాలకు వెళ్తున్న బస్సు ఐటీఐ జంక్షన్ వద్ద ఈ దాడి జరిగింది.

ముగ్గురు మహిళలు గట్టిగా అరుస్తూ గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత లేదు. బాధితులపై దాడి జరిగిన తీరును పరిశీలిస్తున్న పోలీసులు, ఈ దాడిలో యాసిడ్ వాడిందా లేదా ఇతర ద్రావణమా అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు.

కంచరపాలెం CI చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుల కదలికలపై ఆరా తీస్తున్నారు. దాడి వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన చేస్తూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

ఈ ఘటన స్థానికులకు భయాందోళన కలిగించింది. ఇలాంటి ఘటనలు మరింత జాగ్రత్త అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *