అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ – జై భీమ్ పాట ఆవిష్కరణ

Jai Bheem MRPS organized a rally in Kurnool to honor Ambedkar and launched the "Jaiho Janayya" song, highlighting equality and Ambedkar's ideology. Jai Bheem MRPS organized a rally in Kurnool to honor Ambedkar and launched the "Jaiho Janayya" song, highlighting equality and Ambedkar's ideology.

జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో “జయహో జానయ్య” అనే పాటను సొగనూర్ ఆనంద్ రచించి పాడి, కర్నూలు జిల్లా మంత్రాలయంలో విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ, రాజ్యాంగం వల్ల అన్ని కులాల మధ్య సమానత్వం సాధ్యమైందని అన్నారు. ఆనంద్ రచించిన పాటను ఢిల్లీకి పరిచయం చేయాలని ఉద్దేశిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అంబేద్కర్ సిద్ధాంతాలను మంత్రాలయం నియోజకవర్గంలో మరింతగా ప్రచారం చేస్తామని చెప్పారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుండి రాగసుధ లాడ్జి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు, కర్నూలు జిల్లా పలు ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామ నాయకులు, సముదాయ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నాయకులు ముత్తు సుమల, ప్రశాంత్ కుమార్, సత్యన్న, సంఘటి యోహాను, దేవరపాటి అనీల్ కుమార్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గం జై భీమ్ ఎంఆర్పీఎస్ సభ్యులు, గ్రామ నేతలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *