అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం, చింతలపూడి నియోజకవర్గంలో పలు ప్రైవేట్ కరమాలపై వెళ్లారు. ఈ సందర్బంగా, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చింతలపూడి అభివృద్ధి కార్యక్రమాలపై లోకేష్కి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ, “చింతలపూడి నియోజకవర్గంలో డిగ్రీ చదివిన, ఇంగ్లీష్పై మంచి అవగాహన కలిగిన విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పరీక్షలలో ఎంపిక కావాలని, వారు జాబ్ మేళాలో పాల్గొని మంచి జీతం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని తెలిపారు.
28వ తేదీన చింతలపూడి, 29న జంగారెడ్డిగూడెం, 30న కామవరపుకోట, డిసెంబర్ 1న లింగపాలెం మండలాల్లో జాబ్ మేళాలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, రామ్ కుమార్, మండల అధ్యక్షులు సత్యనారాయణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలు రాసి, ఎంపికైన వారిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని రోషన్ కుమార్ చెప్పారు. ఈ జాబ్ మేళా కార్యక్రమం యువతకు మంచి అవకాశాలను అందించడంతో పాటు, అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Job mela pettinadhuku very thank you