Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవాలంటీర్లకు వేతన సమస్యల పరిష్కారం కోరుతున్న సిపిఐ

వాలంటీర్లకు వేతన సమస్యల పరిష్కారం కోరుతున్న సిపిఐ

-

Chat on WhatsApp

పిఠాపురం పట్టణంలో ఉదయం 10 గంటలకు సచివాలయం వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్ల సమస్యలను మీడియా ముందు వినిపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

వాలంటీర్లకు వేతనాలు పెంచడం సహా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు రూ. 10,000 జీతం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీలను అమలు చేయకపోవడం వలన వాలంటీర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వాలంటీర్ల సమస్యలపై సిపిఐ నేతలు ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని సాక రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో వాలంటీర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, తమ జీవితాలను కాపాడే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వాలంటీర్ల ఆందోళన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుందని భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp